రాజన్న సిరిసిల్ల : గులాబ్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో జిల్లా తడిసి ముద్దయింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పంటలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాగా, జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతంలో నీటమునిగిన ప్రాంతాలను కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలించారు.
భారీ వర్షాలకు పెద్ద బోనాల రఘు చెరువు మత్తడి దూకడంతో కలెక్టర్ కార్యాలయం నీట మునిగింది. దీంతో కలెక్టర్ ట్రాక్టర్ ఆర్డీవో, తహసీల్దార్తో కలిసి ట్రాక్టర్లో బయటకు వచ్చారు. వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.