చొప్పదండి : కొవిడ్ టీకాను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి తీసుకోవాలని చొప్పదండి
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. చొప్పదండి మున్సిపాలిటి పరిధిలో గురువారం ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ను ఆయన పరిశీలించి మాట్లాడారు.
సరిపడా డోసులు అందుబాటులో ఉన్నాయని 18 ఏండ్లు నిండిన అర్హులందరూ టీకాను తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గురం నీరజ, వైస్ చైర్పర్సన్ ఇప్పనపల్లి విజయ లక్ష్మి, సింగిల్విండో చైర్మెన్ వెల్మమల్లారెడి, మార్కెట్ కమిటీ చైర్మెన్ ఆరెల్లి చంద్రశేఖర్గౌడ్, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్రెడ్డి, కౌన్సిలర్ మాడూరి శ్రీనివాస్, నాయకులు పెరుమండ్ల గంగయ్య, మహేశుని మల్లేశం, కొత్తూరి నరేశ్, వైద్యాధికారి రమాదేవి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.