కరీంనగర్ రూరల్: జూబ్లీనగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు బోల్తాపడింది. సోమవారం మండలంలోని నగునూర్ నుంచి మొగ్దుంపూర్ వెళ్లే బైపాస్ రోడ్డులో జూబ్లీనగర్లోని ఎల్లమ్మ ఆలయ సమీపంలో వల్లంపహాడ్ నుంచి పెద్దపెల్లి వెళ్తున్న వల్లంపహాడ్కు చెందిన సత్యనారాయణ కారు జూబ్లీనగర్-చామనపల్లి శివారులోని మూలమలుపు వద్ద అదుపు తప్పి చెట్లను ఢీకొట్టి బోల్తాపడింది. అదృష్టవశాత్తు అందులో ఉన్న సత్యనారాయణకు ఎటువంటి గాయాలు కాలేదు. ఘటనాస్థలిలో ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.