పెద్దపల్లిటౌన్, జూలై 30: పెద్దపల్లి 18వ వార్డు, తెనుగువాడ, పెద్దమ్మనగర్ ప్రజలు కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ సూచించారు. తెనుగువాడలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో స్థానికులకు కొవిడ్ టీకాలను శుక్రవారం వేయించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి పండ్లు అందజేశారు. ఇక్కడ 17వ వార్డు కౌన్సిలర్ కొలిపాక సంధ్య, నాయకులు చిరంజీవి, శ్రీనివాస్, నర్సయ్య పాల్గొన్నారు.
మంథని రూరల్, జూలై 30: రచ్చపల్లిలో వ్యాక్సినేషన్ నిర్వహించారు. గ్రామంలోని 170 మందికి కొవిషీల్డ్ రెండో డోస్ వైద్య సిబ్బంది వేశారు. కార్యక్రమంలో వైద్యురాలు శంకరాదేవి, సర్పంచ్ కనవేన శ్రీనివాస్, ఉప సర్పంచ్ గుర్రం సదానందం, ఏఎన్ఎం జ్యోతి, వైద్య సిబ్బంది, పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు.
రామగిరి, జూలై 30: వెంకట్రావుపల్లిలో కొవిడ్ రెండో డోసు వ్యాక్సినేషన్ శిబిరం ప్రారంభించారు. మండల ప్రత్యేకాధికారి, జిల్లా మైనింగ్ ఏడీ సాయినాథ్ పాల్గొని ప్రారంభించి టీకాను వేసుకున్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి నాగ శిరోమణి, సిబ్బంది తదితరులున్నారు.
జ్యోతినగర్(రామగుండం), జూలై 30: కరోనా కట్టడిలో భాగంగా అకెనపల్లిలో మూడో విడుతగా కరోనా వ్యాక్సినేషన్ సెంటర్ను ఏర్పా టు చేసినట్లు సర్పంచ్ మేరుగు పోచం తెలిపారు. గ్రామంలోని కమ్యూనిటీ హాల్లో వ్యాక్సినేషన్ సెంటర్ను సర్పంచ్ ప్రారంభించి మాట్లాడారు. ఇక్కడ పుట్నూర్ పీహెచ్సీ వైద్యురాలు స్వప్న, హెల్త్ సూపర్వైజర్ సంతోష్, పంచాయతీ కార్యదర్శి రజిత, ఏఎన్ఎంలు సరిత, రజిత, విజిత, అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి, ఆశ వర్కర్ రాజేశ్వరి తదితరులు ఉన్నారు.