ఎమ్మెల్సీ నారదాసుతో చల్లూరు, మామిడాలపల్లి టీఆర్ఎస్ ముఖ్య నాయకులు
వీణవంక, మే 30: తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ వెంటే తాము ఉంటామని చల్లూరు, మామిడాలపల్లి ముఖ్య కార్యకర్తలు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావుకు స్పష్టం చేశారు. హుజూరాబాద్ జిల్లా వీణవంక మండలంలోని చల్లూరు, మామిడాలపల్లి గ్రామాల్లో ఆదివారం ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రాణాలను పైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశారని, సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అనునిత్యం కృషి చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని, టీఆర్ఎస్ పార్టే అందరికీ శ్రీరామరక్ష అని అన్నారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తన స్వార్థ రాజకీయాల కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలను అవహేళన చేశారని, అసైన్డ్ భూములను అక్రమంగా ఆక్రమించుకొని ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చాడని విమర్శించారు. తొండలు గుడ్లు పెట్టని భూములని చెప్తున్న ఈటల రాజేందర్ కోళ్లు ఎలా గుడ్లు పెడుతున్నాయని ప్రశ్నించారు.
చేసిన తప్పును కప్పి పుచ్చుకోవడానికి ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్పై తిరుగుబాటు చేస్తున్నాడని అన్నారు.టీఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ అని, పేద ప్రజల కన్నీళ్లు తుడవడానికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. అనంతరం పేద ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే పని చేస్తామని, టీఆర్ఎస్ పార్టీవెంటే ఉంటామని చల్లూరు, మామిడడాలపల్లి టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక, జడ్పీటీసీ మాడ వనమాల, ఏఎంసీ చైర్మన్ వాల బాలకిషన్రావు, సింగిల్విండో చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, కో ఆప్షన్మెంబర్ హమీద్, ట్రస్మా నియోజకవర్గ అధ్యక్షుడు ముసిపట్ల తిరుపతిరెడ్డి, మాజీ సింగిల్విండో చైర్మన్ మాడ సాదవరెడ్డి, సీనియర్ నాయకుడు పరిపాటి రవీందర్రెడ్డి, నారాయణ, పొదిల రమేశ్, బండ కిషన్రెడ్డి, మల్లయ్య, పుల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
వినోద్కుమార్తో దొంత భేటీ
హుజూరాబాద్టౌన్, మే 30: రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ను ఆదివా రం హైదరాబాద్లోని తన నివాసంలో హుజూరాబాద్ ప్రాంత నాయకుడు, తిరుమల తిరుపతి దేవస్థానం తెలంగాణ ప్రభుత్వ మాజీ అనుసంధాన అధికారి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దొంత రమేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులపై బోయినపల్లి వినోద్కుమా ర్ ఆరా తీశారన్నారు. నియోజకవర్గంలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేశారని తెలిపారు. కాగా, ఇటీవల టీఆర్ఎస్ అగ్ర నాయకుల తో దొంత రమేశ్ వరుసగా భేటీ అవ్వడం ప్రాధా న్యం సంతరించుకుంది. ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు సందమల్ల బాబు, ముక్క శ్రీనివాస్, దొమ్మాటి వెంకన్న, తిరుపతి పాల్గొన్నారు.