చొప్పదండి, ఏప్రిల్ 28: కొనుగోలు కేంద్రాలకు దాన్యం తీసుకువచ్చే రైతులకు సకల సౌకర్యాలు కల్పించాలని సింగిల్విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి సూచించారు. మండలంలోని వెదురుగట్టలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని రైతులకు సూచించారు. కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఎండలు ఎక్కువగా కొడుతున్నందున కేంద్రంలో తాగునీటిని నిరంతరం అందుబాటులో ఉంచాలన్నారు. చేతులు కడుక్కునేందుకు సబ్బులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని సూ చించారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు.
కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 28: కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ ఏఎంసీ చైర్ పర్సన్ ఎలుక అనిత కోరారు. బుధవారం కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. ఏఎంసీ వైస్ చైర్మన్ గుజ్జుల రవీందర్రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి పద్మావతి, కరీంనగర్ విండో చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్రెడ్డి, ఆర్బీఎస్ కన్వీనర్ కాశెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి పురుషోత్తం, డైరెక్టర్లు వంగల శ్రీలత, శ్రీనివాస్, రావారాజు, పెట్టం రమేశ్, సాదుల వెంకన్న, హమాలీ సంఘం అధ్యక్షుడు రమేశ్, మార్కెట్ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు.