చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
నూతన రేషన్కార్డుల పంపిణీ
చొప్పదండి, జూలై 26: ప్రజాసంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆవరణలో సోమవారం నూతన రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ నిరుపేదలకు బాసటగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని కొనియాడారు. ఆహారభద్రత కార్డులు లేనివారు ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని ఆలోచించి సీఎం కేసీఆర్ నూతన రేషన్కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారని తెలిపారు. నియోజకవర్గవ్యాప్తంగా 1,428 రేషన్కార్డులు మంజూరయ్యాయని, పెండింగ్లో ఉన్న దరఖాస్తులకు సంబంధించిన రేషన్కార్డులు కూడా త్వరలోనే మంజూరవుతాయని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, సింగిల్ విండో చైర్మన్ వెల్మమల్లారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్గౌడ్, తహసీల్దార్ రజిత, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్రెడ్డి, నాయకుడు మహేశుని మల్లేశం తదితరులు పాల్గొన్నారు.