కేసీఆర్తోనే అన్నివర్గాల సంక్షేమం
గెల్లును గెలిపిస్తే అందుబాటులో ఉండి సేవ చేస్తడు
బీజేపీకి ఓట్లేస్తే ధరలను సమర్థించినట్లే
మంత్రి కొప్పుల ఈశ్వర్
జమ్మికుంట, అక్టోబర్ 25: పేదల ఆర్థికాభివృద్ధికి టీఆర్ఎస్ కృషి చేస్తుంటే.. బీజేపీ మాత్రం ధరలు పెంచుతూ పేదల నుంచి డబ్బులు గుంజుతున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. బీజేపీకి ఓటేస్తే ధరల పెంపును సమర్థించినట్లేనని, కారు గుర్తుకు ఓటేస్తే అభివృద్ధి, సంక్షేమాన్ని కోరుకున్నట్లేనని చెప్పారు. సీఎం కేసీఆర్తోనే అన్నివర్గాల అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. జమ్మికుంట పట్టణంలోని 1, 2 వార్డుల్లో ధర్మారం ప్రజలతో సమావేశమయ్యారు. అనంతరం పద్మశాలి వాడ, పాత మారెట్ ఏరియాల్లో ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మంత్రి మాట్లాడారు. ఈటల కన్నతల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీని వదిలి బీజేపీలోకి పోయి ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. రాజేందర్ గెలిస్తే ఆయనకు మంచి జరుగుతదని, అదే టీఆర్ఎస్ గెలిస్తే ప్రజలందరికీ మంచి జరుగుతుందని చెప్పారు. ఎస్సీలు బాగుపడడం ఇష్టంలేక బీజేపోళ్లు దళితబంధును ఆపించారని, కానీ వారం రోజుల్లో దళితబంధు మొదలవుతుందని తెలిపారు. ముస్లిం మైనారిటీలతోపాటు అన్ని వర్గాల ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని, మనది దేశంలోనే గొప్ప లౌకిక రాష్ట్రమని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ముస్లింలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించామని, హుజూరాబాద్కు 4వేల డబుల్ ఇండ్లను మంజూరు చేస్తే రాజేందర్ కట్టలేదని విమర్శించారు. మసీదులు, దర్గాలకు నిధులివ్వడంతోపాటు రంజాన్ పండుగ సందర్భంగా పేదలకు దుస్తులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. మతతత్వ పార్టీ బీజేపీకి ఓటు వేయవద్దని ముస్లింకు సూచించారు. కారుగుర్తుకు ఓటు వేసి గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పొనగంటి మల్లయ్య వీరన్న, భిక్షపతి, సింగిల్ విండో చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు టంగుటూరి రాజ్కుమార్, నాయకులు సమ్మిరెడ్డి, కశ్యప్ రెడ్డి, రామస్వామి, సలీం పాషా పాల్గొన్నారు.