గన్నేరువరం, సెప్టెంబర్ 25: చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నట్లు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మండలంలోని ఖాసీంపేట చౌరస్తాలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. అనంతరం పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. గ్రామంలో రజక సంఘం భవనం, ధోబీఘాట్ నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్కు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంప వెంకన్న ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. జడ్పీటీసీ మాడుగుల రవీందర్రెడ్డి, ఆర్బీఎస్ జిల్లా కో-ఆర్డినేటర్ గూడెల్లి తిరుపతి, మండల కో-ఆర్డినేటర్ బోడ మాధవరెడ్డి, టీఆర్ఎస్ మహిళా విభాగం మండలాధ్యక్షురాలు కుసుంబ నవీన, ఎంపీడీవో స్వాతి, సర్పంచ్ మల్లీశ్వరి, ఉప సర్పంచ్ సంపత్రెడ్డి, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు దుబ్బాక రమేశ్, మండలాధ్యక్షుడు నాగరాజు, జనరల్ సెక్రటరీ సంపత్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మోహన్రెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు మహ్మద్ రఫీ, సర్పంచులు జ్యోతి, రేఖ, నాయకులు లక్ష్మణ్, సుధాకర్, వెంకటేశ్వర్లు, మహేందర్రెడ్డి, చంద్రయ్య, వెంకటరమణారెడ్డి, సురేశ్, రాము గౌడ్ ఉన్నారు.