హుజూరాబాద్టౌన్, సెప్టెంబర్ 25: రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా శనివారం హుజూరాబాద్ పట్టణానికి వచ్చిన వకుళాభరణం కృష్ణమోహన్రావుకు ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గంలోని బీసీ సంక్షేమ సంఘాలు, కుల సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికి, పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. కాగా, కేసీ క్యాంపు నుంచి ద్విచక్ర వాహనాలపై భారీ ర్యాలీగా తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వకుళాభరణం కృష్ణమోహన్రావు మాట్లాడుతూ, తనకు పదవి అప్పగించిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటానన్నారు. హుజూరాబాద్ బిడ్డగా ఈ గడ్డకు మంచి పేరు వచ్చేలా పని చేస్తానన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, హుజూరాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్లూరి విజయకుమార్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి రావుల అశోక్, నియోజకవర్గ అధ్యక్షుడు బండారి సదానందం, బీసీ సంఘాల నాయకులు కన్నెబోయిన మహేందర్యాదవ్, కాజీపేట శ్రీనివాస్, కొలిపాక సమ్మయ్య, జడల అశోక్, కుర్ర మల్లేశ్, బండి సమ్మయ్య, చింతల శ్రీనివాస్, సుంకరి రాజమొగిలి, ఓదెలు, తల్లా ప్రసాద్, నల్లగొండ నాగరాజు, కోమటి శ్రీనివాస్, చిలకమారి శ్రీనివాస్, ఆవుల రమేశ్, చింతల సుమన్, ఆర్ మల్లయ్య, బోయిని రాజు, సంగెం శ్రీనివాస్, స్వర్గం నరేశ్, అల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ కమిషన్ చైర్మన్ను కలిసిన కలెక్టర్
రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావును కలెక్టర్ ఆర్వీ కర్ణన్ హుజూరాబాద్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వకుళాభరణంకు పూల మొక అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, వకుళాభరణం కృష్ణమోహన్రావును వివిధ సంఘాల నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.