జమ్మికుంట చౌరస్తా, సెప్టెంబర్25 : టీఆర్ఎస్ హుజూరాబాద్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ను నియోజకవర్గ రెడ్డి కులబాంధవులు నిండు మనసుతో ఆశీర్వదించారు. జమ్మికుంట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో శనివారం జరిగిన రెడ్డి కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో టీఆర్ఎస్కు జైకొట్టారు. దీనికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర శాసన సభాధిపతి పోచారం శ్రీనివాస్రెడ్డితో పాటు ఇతర మంత్రుల ప్రసంగాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. మొత్తానికి హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్ను రెడ్డి బిడ్డలు మనస్ఫూర్తిగా దీవించారు. సభలో నిర్వాహకులు 14 వేల కుర్చీలను ఏర్పాటు చేయగా, మొత్తం నిండిపోవడమే కాకుండా, వేలాది మంది బయట నిలబడి ప్రసంగాలను ఆసక్తిగా విన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, పాడి కౌశిక్రెడ్డి చెప్పిన విషయాలను శ్రధ్ధగా ఆలకించారు. అందరి ప్రసంగాల అనంతరం చివ ర్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ఉద్యమ నేపథ్యం గురించి వివరిస్తూ చెప్పిన అంశాలు ఆకట్టుకున్నాయి. గెల్లు గురించి వక్తలు మాట్లాడుతుంటే సభలో ఉత్సాహం నెలకొంది. ఆయనకు మద్దతు తెలుపుతూ వేల చేతులు అభివాదాలు తెలిపాయి. తన ఉద్యమ ప్రస్థానంలో వివిధ స్థాయిల్లో రెడ్డి కులస్తుల పాత్రను మరువ లేమని గెల్లు శ్రీనివాస్ చెప్పినప్పుడు కరతాళ ధ్వనులతో సభ మొత్తం మార్మోగింది. ఇంటర్మీడియట్ నుంచి మొదలు ఇప్పటి వరకు రెడ్డి సామాజిక వర్గ పెద్దలు తనకు ఎలా సహాయ పడ్డారో తెలుపుతూ ఆయా వ్యక్తుల పేర్లను, వారు చేసిన సహాయాన్ని గెల్లు వివరిస్తుంటే జనం ఆసక్తిగా విన్నారు. గాయకుడు సాయిచంద్ పాడిన పాటలు సభను ఉరకలెత్తించాయి. సభా ప్రాంగణం మొత్తం జై తెలంగాణ నినాదాలతో మార్మోగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు తరలిరావడం విశేషం. ఈ సభలో రెడ్డి ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, దాసరి మనోహర్రెడ్డి, రెడ్డి కులాల ఐక్య వేదిక నాయకులు ఏనుగు సంతోష్రెడ్డి, పోరెడ్డి శంతన్రెడ్డి, దివంగత మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి కుమారుడు కేతిరి రాజప్రతాపరెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డి ప్రత్యేక ఆకర్శణగా నిలిచారు.