కరీంనగర్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్ శశాంక ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఆయన డీపీవో, ఎస్టీపీవో, ఎస్ఈ, ఎన్పీడీసీఎల్, డీఆర్డీవో, డీఎల్పీవో, ఎంపీవోలతో పారిశుధ్యం, పల్లె ప్రగతి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాల్లో ప్రతిరోజూ చెత్తను సేకరించడం, షెడ్డుకు తరలించడం, వేరు చేయడం, కంపోస్ ఎరువు తయారీ విధానాన్ని డీఎల్పీవోలు, ఎంపీవోలు నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ విషయంపై ఎస్బీఎం తరఫున పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా శిక్షణ ఇస్తారని చెప్పారు. ఇండ్లు, వీధి దీపాలకు విద్యుత్ క్రమపద్ధతిలో సరఫరా అయ్యే విధంగా చూడాలన్నారు. పెండింగ్ విద్యుత్ బిల్లులు తక్షణమే చెల్లించేలా చూడాలని సూచించారు. వారం రోజుల్లో లెకలు సరిచేసి బిల్లు చెల్లించి నివేదిక తయారు చేయాలన్నారు. పల్లెల్లో సెగ్రిగేషన్ షెడ్లు పూర్తి చేయాలని ఆదేశించారు. పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. సమావేశంలో డీఆర్డీవో శ్రీలత, డీపీవో వీరబుచ్చయ్య, డీఎల్పీవో హరికిషన్, వివిధ శాఖల అధికారులు కిషన్స్వామి, రమేశ్, వేణు, ఎంపీవోలు తదితరులు పాల్గొన్నారు.