ఎంజీఎన్సీఆర్ఈ చైర్మన్ ప్రసన్న కుమార్
వృక్షా రక్షాబంధన్పై ఆన్లైన్ కార్యక్రమం
పెద్దపల్లి కమాన్, ఆగస్టు 21: పర్యావరణ పరిరక్షణ మహాయజ్ఞంలో విద్యార్థులందరూ భాగస్వాములు కావాలని కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ విద్యా మండలి (ఎంజీఎన్సీఆర్ఈ) చైర్మన్ డాక్టర్ ఉండవల్లి గాయత్రి ప్రసన్న కుమార్ పిలుపునిచ్చారు. జిల్లా విద్యాశాఖ, జాతీయ హరితదళం ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా శనివారం జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల హరిత ఉపాధ్యాయులు, విద్యార్థులకు ‘వృక్షా రక్షాబంధన్’పై ఆన్లైన్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసన్నకుమార్ పాల్గొని మాట్లాడారు. భవిష్యత్ తరాలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా జీవించాలంటే పర్యావరణ సమతుల్యత చాలా ముఖ్యమని పేర్కొన్నారు. నేటి పిల్లలే రేపటి పౌరులు కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. డీఈవో జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. మొక్కలు నాటితే మానవాళి మనుగడకు ఎంతో దోహదపడుతాయన్నారు. స్వచ్ఛమైన ఆక్సిజన్ కావాలంటే వృక్షాలు విరివిగా నా టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. అనంతరం జాతీయ హరితదళం రాష్ట్ర ప్రాజెక్టు అధికారి విద్యాసాగర్, జిల్లా సమన్వయకర్త రవినందన్రావు, ఎక్లాస్పూర్ ఉన్నత పాఠశాల హెచ్ఎం సంపత్రావు, వడ్కాపూర్ ఉన్నత పాఠశాల హరిత ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు, చందనాపూర్కు చెందిన విద్యార్థులు రాజాంజలి, మధురిమ తదితరులు ప్రసంగించారు. అంతకుముందు రాష్ట్ర హరితదళం రీసోర్స్పర్సన్ మాధవరెడ్డి పర్యావరణ రహిత రాఖీలను ఇంట్లో లభించే వస్తువులతో విద్యార్థులతో సులువుగా తయా రు చేయించి ఆకట్టుకున్నారు. తమ పాఠశాలల్లోని మొక్కలు, వృక్షాలకు కట్టి, ఫొటోలను లింకు ద్వారా అప్లోడ్ చేసి ఈ-సర్టిఫికెట్లను వెంటనే పొంది గొప్ప అనుభూతిని పొందారు.
కొలనూర్లో..
ఓదెల, ఆగస్టు 21: కొలనూర్ జిల్లా పరిషత్ హైస్కూల్లో బీజేపీ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. విద్యార్థులు సోదరభావంతో మెలిగేందుకు రక్షాబంధన్ చక్కని సందేశాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. బాలికలు బాలురకు రాఖీలు కట్టి సోదరి అనురాగాన్ని పంచారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కారెంగుల శ్రీనివాస్, ఐరెడ్డి సంపత్రెడ్డి, మడుపు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.