పెద్దపల్లి జంక్షన్, అక్టోబర్ 20: సమాజ హితం కోసం కృషి చేసిన మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ పిలుపునిచ్చారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వాల్మీకి చిత్రపటానికి కలెక్టర్ బుధవారం పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, కుమార్ దీపక్, జిల్లా వెనుబడిన తరగతుల అభివృద్ధి అధికారి జే రంగారెడ్డి, వాల్మీకి బోయ సంఘం అధ్యక్షుడు మహేందర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ సీహెచ్ తిరుపతి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇక్కడ కౌన్సిలర్లు గాదె మాధవి, దేవనంది రమాదేవి, సంపత్, తాడూరి పుష్పకళ శ్రీమాన్ తదితరులు పాల్గొన్నారు.
రామగిరి, అక్టోబర్ 20: రామగిరి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొంరయ్య గౌడ్ ఆధ్వర్యంలో వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో విజయ్కుమార్, టీఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు ఆశ కుమారి, ఉపాధ్యక్షురాలు ఓదెక్క, సూపరింటెండెంట్ శంకర్ రెడ్డి తదితరులున్నారు.
కోల్సిటీ, అక్టోబర్ 20: నగర పాలక సంస్థ కార్యాలయంలో వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మేయర్ అనిల్కుమార్, అధికారులు చిన్నారావు, మహేందర్, రాములు, వెంకటేశ్వర్లు, కిశోర్, సిబ్బంది ఉన్నారు.
కాల్వశ్రీరాంపూర్, అక్టోబర్ 20: మండల పరిషత్ కార్యాలయంలో వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్, జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ శిరీష, విండో చైర్మన్ చదువు రాంచంద్రారెడ్డి, ఎంపీడీవో రాంమోహన్, ఎంపీవో గోవర్ధన్, సర్పంచ్ ఆడెపు శ్రీదేవిరాజు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గొడుగు రాజ్కుమార్, టీఆర్ఎస్వై మండలాధ్యక్షుడు నూనేటి కుమార్, జిన్న రాంచంద్రారెడ్డి, రవి ఉన్నారు.
పెద్దపల్లి రూరల్, అక్టోబర్ 20: పెద్దపల్లి మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో వాల్మీకి చిత్రపటానికి ఎంపీపీ బండారి స్రవంతి, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే మండలంలోని పలు గ్రామాల్లో వేడుకలను నిర్వహించారు. కార్యక్రమాల్లో ఎంపీడీవో రాజు, ఎంపీవో సుదర్శన్, సర్పంచులు చుంచు సదయ్య, తీగల సదయ్య, ఎంపీటీసీ గుర్రాల లక్ష్మి, గట్టేశం, ఏపీవో మల్లేశ్వరి, ఏఈలు పటేల్ మదన్ మోహన్ రెడ్డి, రాజయ్య, సూపరింటెండెంట్ సేనారెడ్డి, సీనియర్ అసిస్టెంట్ హరికృష్ణ, టెక్నికల్ అసిస్టెంట్లు దివ్య, వెంకటేశ్, టైపిస్ట్ అక్రమ్ అలీ, నాయకులు గుజ్జుల కుమార్, సదయ్య పాల్గొన్నారు.
కమాన్పూర్, అక్టోబర్ 20: మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వాల్మీకి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమేశ్, ఎంపీవో ఆరీఫ్ హుస్సేన్, సీనియర్ అసిస్టెంట్ సాదిక్ పాషా, జూనియర్ అసిస్టెంట్ రాజయ్య, నాయకులు రాచకొండ రవి తదితరులు పాల్గొన్నారు.
ఎలిగేడు, అక్టోబర్ 20: మండల కేంద్రంతోపాటు, లాలపల్లిలో వాల్మీకి మహర్షి జయంతిని నిర్వహించారు. ఇక్కడ ఎంపీపీ తానిపర్తి స్రవంతి, వైస్ ఎంపీపీ బుర్ర వీరస్వామిగౌడ్, సర్పంచ్ సింగిరెడ్డి ఎల్లవ్వ, బీసీ వెల్ఫేర్ జిల్లా ఆఫీసర్ రంగారెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసమూర్తి, ఎంపీవో అనిల్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ గోపు విజయభాస్కర్రెడ్డి, వాల్మీకి బోయ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గుడుగుల మహేందర్, నాయకులు బైరెడ్డి రాంరెడ్డి, సామ రాజేశ్వర్రెడ్డి, చలెందుల చంద్రశేఖర్, చుంచు రవి, పెనుకుల సతీశ్, మీసరగొండ మల్లేశ్, ముత్యాల అనిల్, మెనుగు సదయ్య, బొంతల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
జూలపల్లి, అక్టోబర్ 20: మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, వాల్మీకి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఇక్కడ ఎంపీడీవో వేణుగోపాల్రావు, ఏఈ వెంకటస్వామి, ఎంపీవో రమేశ్, ఏపీవో సదానందం తదితరులు పాల్గొన్నారు.
ఓదెల, అక్టోబర్ 20: మండలంలో వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్ కార్యాలయంలో వాల్మీకి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఇక్కడ తహసీల్దార్ రామ్మోహన్, డీటీ వసంతరావు పాల్గొన్నారు.
జ్యోతినగర్(రామగుండం), అక్టోబర్ 20: అంతర్గాం ఎంపీడీవో కార్యాలయంలో వాల్మీకి చిత్రపటానికి ఎంపీపీ దుర్గం విజయ పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మి, ఎంపీడీవో యాదగిరి గౌడ్ ఉన్నారు.