జమ్మికుంట, అక్టోబర్ 20: సంక్షేమం, అభివృద్ధి వైపే ప్రజలున్నారని, అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ పేర్కొన్నారు. బుధవారం ఆయన జమ్మికుంట పట్టణంలో ఆర్యవైశ్యుల దుకాణాలతోపాటు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలిపించాలని ఓటు అభ్యర్థించారు. ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో ఎక్కడా లేవని, రాష్ర్టాలన్నీ తెలంగాణ వైపే చూస్తున్నాయని పేర్కొన్నారు. రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బచ్చు భాస్కర్, కౌన్సిలర్లు లావణ్య, రాజు, నాయకులు శివశంకర్, శరత్, శంకర్, వైకుంఠం, సురేందర్, రాజమౌళి తదితరులున్నారు.
గెల్లు గెలుపు తథ్యం.. మెజార్టీ కోసమే ప్రచారం
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలుపు తథ్యమని, మెజార్టీ కోసమే పార్టీ ప్రచారం చేస్తున్నదని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ పేర్కొన్నారు. జమ్మికుంట పట్టణంలోని రైస్ మిల్లర్ల అసోసియేషన్ భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో వ్యాపారులు అనేక ఇబ్బందులు పడ్డారని, కేసీఆర్ పాలనలో వారి బతుకులు బాగుపడ్డాయని తెలిపారు. వేధింపుల్లేకుండా బిజినెస్ సాఫీగా సాగుతున్నదని చెప్పారు. 24గంటల విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టుతో బంగారు పంటలు పండుతున్నాయని పేర్కొన్నారు. ఫలితంగా రైతులు, వ్యాపారుల జీవితాలు గొప్పగా మారాయని తెలిపారు. వైశ్య, రెడ్డి కులస్తులకు సహకార సంఘాలు ఏర్పాటు చేసి, ఈడబ్ల్యూఎస్ పథకాన్ని అమలు చేస్తున్న ఘనత కేసీఆర్కే దక్కిందని చెప్పారు. పనిచేస్తున్న ప్రభుత్వానికే మద్దతివ్వాలని కోరారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెల్లు శ్రీనివాస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు బచ్చు భాస్కర్, జమ్మికుంట అధ్యక్షుడు జి.రాజమౌళి, వార్డు కౌన్సిలర్లు లావణ్య, రాజు, మాధ వి, నాయకులు సత్యనారాయణ, పాపయ్య, శరత్, మధు, శివశంకర్, రాహుల్, శ్రీనివాస్, సంపత్, సురేందర్, నవీన్ తదితరులున్నారు.