మేయర్ వై సునీల్రావు
46 డివిజన్లో అభివృద్ధి పనులు ప్రారంభం
కార్పొరేషన్, ఆగస్టు 20: నగరంలో ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా పాలకవర్గం ముందుకు సాగుతున్నట్లు మేయర్ వై సునీల్రావు స్పష్టం చేశారు. స్థానిక 46వ డివిజన్లో శుక్రవారం ఆయన సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు. మేయర్ వై సునీల్రావు మాట్లాడుతూ, టవర్సరిల్ ప్రాంతంలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో బల్దియా నిధులతో రోడ్లు, మురుగు కాలువలు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. డివిజన్ పరిధిలో రోడ్లు, డ్రైనేజీల సమస్యలను పరిశీలించి, ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. స్థానికంగా ఉన్న స్లాటర్ హౌస్ సమస్యను పరిషరించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. టవర్సరిల్ నుంచి శాస్త్రీ రోడ్డు, డీఎఫ్వో చౌరస్తా నుంచి రూరల్ పోలీస్ స్టేషన్ రోడ్డును అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో సామూహిక మరుగుదొడ్లు, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కార్పొరేటర్ వంగల శ్రీదేవీపవన్ తదితరులున్నారు.