లక్నో : యూపీలోని అలీఘఢ్ జిల్లాలో వివాహిత ప్రియుడితో కలిసి బలవన్మరణానికి పాల్పడింది. అతౌలి ప్రాంతంలోని ఓ ఇంట్లో ఒకే చీరతో ఉరి వేసుకుని వారిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. స్ధానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆదివారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మృతులను బసై గ్రామానికి చెందిన రవి, పరోరా గ్రామానికి చెందిన విమ్లేష్ దేవిగా గుర్తించారు. విమ్లేష్ దేవికి ఇప్పటికే ఆరేండ్ల కుమారుడు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
మూడు రోజుల కిందటే వీరు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. గత కొద్ది రోజులుగా వీరు గది అద్దెకు తీసుకుని ఉంటున్నారని తెలిపారు. కొద్ది రోజుల కిందట తమ ఇంట్లో అద్దెకు దిగిన వీరు అప్పటినుంచి బయటకు రాలేదని ఇంటి యజమాని సుశీలా దేవి చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.