ములుగు : అనుమానాస్పద స్థితిలో ట్రాక్టర్ మెకానిక్ మృతి చెందాడు. ఈ సంఘటన ములుగు జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ములుగుకు చెందిన ఎండీ రిజ్వాన్(30) అనే ట్రాక్టర్ మెకానిక్ సోమవారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ములుగు నుంచి పసరకి వెళ్లే జాతీయ రహదారిపై జంగాలపల్లి వద్ద తీవ్ర గాయాలతో పడి ఉండగా 108 సిబ్బంది ములుగు ప్రభుత్వ దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందాడు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.