ముంబై,జూలై :ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 248 పాయింట్ల లాభంతో 52,620 వద్ద నిఫ్టీ 75 పాయింట్లు లాభపడి 15,767 వద్ద కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో సూచీలు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి అమెరికా మార్కెట్ల లాభాల ముగింపుతో పాటు ఆసియా మార్కెట్ల సానుకూల ధోరణి దేశీ మార్కెట్ల పై ప్రభావం చూపుతున్నాయి.