విజయ్సేతుపతి, మాధవన్ కథానాయకులుగా తమిళంలో రూపొందిన ‘విక్రమ్వేద’ చిత్రం కమర్షియల్గా పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నది. తాజాగా ఈ చిత్రం బాలీవుడ్లో రీమేక్ కాబోతున్నది. ఇందులో హృతిక్రోషన్, సైఫ్అలీఖాన్ కథానాయకులుగా నటించబోతున్నారు. ఈ రీమేక్లో ఆమిర్ఖాన్ కథానాయకుడిగా నటించాల్సింది. సృజనాత్మకపరమైన విభేదాలతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకొన్నారు. ఆమిర్ఖాన్ వైదొలగడంతో ఈ రీమేక్ నిలిచిపోయినట్లు వార్తలొచ్చాయి. ఆ ప్రచారాన్ని ఖండిస్తూ హృతిక్రోషన్, సైఫ్ఆలీఖాన్లతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తమిళ మాతృకకు దర్శకత్వం వహించిన పుష్కర్-గాయత్రి ద్వయం హిందీ రీమేక్ నిర్దేశక బాధ్యతల్ని స్వీకరించనున్నారు. ఓ పోలీస్ ఆఫీసర్కు, గ్యాంగ్స్టార్కు మధ్య వైరం నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ఈ ఏడాది చివరలో సినిమాను సెట్స్పైకి తీసుకురానున్నారు. 2022 సెప్టెంబర్లో విడుదలకానున్నది.