‘జో బైడెన్' బృందంలో మనోడు

స్పీచ్ డైరెక్టర్గా చొల్లేటి వినయ్రెడ్డి ఎంపిక
ఆయన తండ్రిది హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట
నాలుగు దశాబ్దాల క్రితమే అమెరికాలో స్థిరపడ్డ కుటుంబం
హుజూరాబాద్ రూరల్, జనవరి 19: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బృందంలో మన తెలుగోడికి అరుదైన స్థానం దక్కింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన చొల్లేటి వినయ్రెడ్డి అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పీచ్ డైరెక్టర్ల బృందంలో ఒకరిగా నియమితులయ్యారు. వినయ్రెడ్డి తండ్రి నారాయణరెడ్డి వృత్తిరీత్యా డాక్టర్. 40 ఏండ్ల కింద అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. వినయ్రెడ్డి అమెరికాలోనే విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఆంగ్లంపై మంచి పట్టు ఉండడంతో బైడెన్ స్పీచ్ డైరెక్టర్గా ఎంపికయ్యాడు. వినయ్రెడ్డి తండ్రికి పోతిరెడ్డిపేట గ్రామంలో ఇల్లు, వ్యవసాయ భూమి ఉంది. గ్రామానికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారని గ్రామస్తులు తెలిపారు. వినయ్రెడ్డికి బైడెన్ బృందంలో చోటు దక్కినందుకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
- పెండ్లి చెడగొట్టాలని ఇన్స్టాగ్రామ్లో వేధింపులు
- చేపల విక్రయ వాహనాలనుత్వరగా అందజేయండి
- భద్రతలో భాగస్వామ్యం..
- 12 భాషల్లో రైల్వే హెల్ప్లైన్ సేవలు
- రోడ్డు భద్రతలో ఇక సామాన్యుడే ‘సేవియర్'
- మూడు డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రతలు
- సమాజంలో స్త్రీల పాత్ర గొప్పది
- 160 మంది అతివలకు చేయూత
- ఆత్మవిశ్వాసమేఆలంబనగా ఎదగాలి
- 09.03.2021, మంగళవారం మీ రాశిఫలాలు