మచిలీపట్నం, జూన్ 9: కృష్ణాజిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన జే.నివాస్ బుధవారం రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)ను మర్యాదపూర్వకంగా కలిశారు. మచిలీపట్నం ఆర్ అండ్ బీ అతిథిగృహంలో మంత్రి నానికి కలెక్టర్ పుష్పగుచ్చం అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని నూతన కలెక్టర్ జె నివాస్ కు శుభాకాంక్షలు తెలిపి, స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ మాధవిలత పాల్గొన్నారు.