హైదరాబాద్ : మానవాళి ప్రగతికి బౌద్ధం చూపిన బాట నేటికి ఆచరణీయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గౌతమ బుద్ధుడి జయంతి, బుద్ధ పూర్ణిమ సంధర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సహనంతో కూడిన అహింసాయుత జీవన విధానము, అందులోని మూలాలు, భౌద్ధవారసత్వం నుంచే అలవడ్డాయన్నారు. నాగార్జునసాగర్లో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది చేస్తున్న బుద్ధవనం అంతర్జాతీయంగా భౌద్ధ కేంద్రంగా రూపుదిద్దుకుంటున్నదని తెలిపారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడటమే గౌతమ బుద్ధునికి నిజమైన నివాళి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ముందుకు సాగుతున్నదని ఆయన తెలిపారు.