ముంబై: మహారాష్ట్రలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతూనే ఉన్నాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 24,136 మందికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ కాగా, 601 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,14,368 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 90,349కు చేరింది. మరోవైపు ముంబైలో 24 గంటల్లో 1,037 మందికి పాజిటివ్గా తేలింది. 24 గంటల్లో 37 మంది చనిపోయారు. ప్రస్తుతం ముంబైలో 27,649 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య 14,708కు పెరిగింది.