భోపాల్ : మధ్యప్రదేశ్ రెవా జిల్లాలోని కుంజ్ బీహారీ కొవిడ్ కేర్ సెంటర్ను బీజేపీ ఎంపీ జనార్ధన్ మిశ్రా శుభ్రం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. మంగళవారం ఆయన ఆకస్మికంగా కొవిడ్ కేర్ సెంటర్ను తనిఖీ చేశారు. అక్కడ టాయిలెట్స్ అపరిశుభ్రంగా ఉండటంతో.. చేతులకు గ్లౌసులు వేసుకుని తానే స్వయంగా క్లీన్ చేశారు. కొవిడ్ కేర్ సెంటర్లో టాయిలెట్స్ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని ఎంపీ అధికారులను హెచ్చరించారు. పబ్లిక్ టాయిలెట్స్ను ఎంపీ జనార్ధన్ క్లీన్ చేయడం ఇదే తొలిసారి కాదు. 2018లో ఓ పాఠశాలలో కూడా టాయిలెట్స్ను పరిశుభ్రం చేశారు.