మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు
మున్సిపాల్టీలో పర్యటన
అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష
సీసీసీ నస్పూర్, మే 7: కొవిడ్హ్రిత నస్పూర్ మున్సిపాలిటీగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే దివాకర్రావు అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. నస్పూర్లో శుక్రవారం ఆయన పర్యటించారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కరోనా కేసులు, వేసవిలో తలెత్తే నీటి సమస్య, పారిశుధ్యం, మున్సిపల్ కార్మికుల పనివేళలు, తదితర అంశాలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించారు. కరోనా కేసుల నివారణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. కేసులు ఎక్కువ ప్రాంతాల్లో శానిటేషన్, సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలని సూచించారు. కాలనీల్లో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్ నిత్యం ప్రజల్లో ఉండి కరోనా టెస్టులు, టీకా, కొవిడ్ నిబంధనలపై అవగాహన కల్పించాలని సూచించారు. వేసవిలో నీటి ఎద్దడి ఉంటే ట్యాంకర్ల ద్వారా మంచినీరు అందించాలని అధికారులను ఆదేశించారు. దహన సంస్కారాల కోసం పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. మున్సిపల్ సిబ్బందికి మాస్కులు, గ్లౌస్లు, శానిటైజర్లు అందజేయాలని సూచించారు. కొవిడ్ నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, పార్టీ మండలాధ్యక్షుడు వంగ తిరుపతి, కౌన్సిలర్ చిడం మహేశ్, కమిషనర్ తుంగపిండి రాజలింగు, శానిటరీ అధికారి సాయికిరణ్, మాజీ ఎంపీటీసీలు హైమద్, శ్రీపతి మల్లేశ్, నాయకులు జాబ్రిగౌస్, గర్శె భీమయ్య, కొయ్యల కొమురయ్య, జక్కుల రాజేశం, రవిగౌడ్, కాటం రాజు, దగ్గుల మధు, సాజీద్, తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పరిశీలన
నస్పూర్లో తెలంగాణ భవన్ పేరుతో నిర్మించిన మంచిర్యాల జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే దివాకర్రావు శుక్రవారం పరిశీలించారు. కార్యాలయ ఆవరణ , ఆఫీస్ గది, సమావేశ మందిరాన్ని పరిశీలించారు. హాల్ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూడాలని, కుర్చీలు అందుబాటులో ఉంచాలని కార్యకర్తలకు సూచించారు. అనంతరం అక్కడే నాటిన మొక్కలకు నీరు పోశారు. చెత్తాచెదారం లేకుండా చూడాలని, వర్షపు నీరు నిలిచిపోకుండా డ్రైనేజీలను వెంటనే ఏర్పాటు చేయాలని, అందుకు సంబంధించిన నివేదికలు రూపొందించి తనకు అందజేయాలని సూచించారు. కొవిడ్ తగ్గిన తర్వాత సీఎం కేసీఆర్ ఇచ్చే టైం ప్రకారం కార్యాలయాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, పార్టీ మండలాధ్యక్షుడు వంగ తిరుపతి, కౌన్సిలర్ చిడం మహేశ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గర్శె భీమయ్య, నాయకులు జాబ్రిగౌస్, దగ్గుల మధు, కాటం రాజు, రవిగౌడ్, తదితరులు పాల్గొన్నారు.