బెంగళూరు: కరోనా ఇండియన్ వుమెన్స్ టీమ్ ప్లేయర్ వేదా కృష్ణమూర్తిని మరోసారి విషాదంలో నింపింది. రెండు వారాల కిందటే ఆమె తల్లిని పొట్టనబెట్టుకున్న ఈ మహమ్మారి తాజాగా ఆమె సోదరి మృతికీ కారణమైంది. గత నెలలో వేదా తల్లి చెలువాంబ దేవి కరోనా బారిన పడి మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పుడు ఆమె కూడా టెస్ట్ చేయించుకోగా.. నెగటివ్ అని తేలింది. అయితే ఆమె సోదరి వత్సలకు మాత్రం కరోనా సోకింది. ఈ మహమ్మారితో పోరాడుతూ గురువారం ఆమె చనిపోయినట్లు వేదా మాజీ కోచ్ ఇర్ఫాన్ సైత్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చెప్పాడు. గత నెల 24న తన తల్లి కరోనా బారిన పడి చనిపోయిందని ట్విటర్ ద్వారా వేదా చెప్పింది.