న్యూఢిల్లీ: శ్రీలంక ఆల్రౌండర్ తిసార పెరెరా సోమవారం అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. యువ ఆటగాళ్లకు అవకాశాలిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు 32 ఏండ్ల పెరెరా పేర్కొన్నాడు. 2014లో లంక టీ20 ప్రపంచకప్ నెగ్గిన జట్టులో సభ్యుడైన పెరెరా.. ఈ ఏడాది మార్చిలో వెస్టిండీస్తో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. 2009లో అరంగేట్రం చేసిన పెరెరా పన్నెండేండ్ల కెరీర్లో ఆరు టెస్టులు, 166 వన్డేలు, 84 టీ20ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. వన్డే, టీ20ల్లో హ్యాట్రిక్లు నమోదు చేసుకున్న పెరెరా.. టీ20 ప్రపంచకప్ నెగ్గడం తన కెరీర్లో అత్యుత్తమ క్షణమని పేర్కొన్నాడు.