న్యూఢిల్లీ, మే 3: వొల్వో కార్లు మరింత ప్రియమయ్యాయి. ఉత్పత్తి వ్యయం అధికమడంతో అన్ని కార్ల ధరలను రూ.2 లక్షల వరకు పెంచుతున్నట్లు సోమవారం తాజాగా ప్రకటించింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి రానున్నట్లు ఒక ప్రకటనలలో వెల్లడించింది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో లగ్జరీ సెడాన్ ఎస్ 90, ప్రీమియం ఎస్యూవీఎస్ ఎక్స్సీ 40, ఎక్స్సీ60, ఎక్స్సీ 90 మోడళ్ళు మరింత అధికంకానున్నాయి.