తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో జన్మించిన ప్రమోద్ మహాజన్.. తన సొంత సోదరుడి చేతిలో 2006 లో సరిగ్గా ఇదే రోజున దారుణహత్యకు గురయ్యారు. కుటుంబ కలహాల నేపథ్యంలో సోదరుడు ప్రవీణ్ మహాజన్ ఆయనతో మాట్లాడేందుకు వచ్చి మూడు రౌండ్ల కాల్పులు జరుపడంతో ప్రమోద్ అక్కడికక్కడే కుప్పకూలి మరణించారు.
బీజేపీ రెండో తరం నాయకుడిగా మహారాష్ట్ర రాజకీయాలను ఒంటిచేత్తే తిప్పిన నాయకుడాయన. అద్వానీ రథయాత్ర ప్రారంభించడంలో ముఖ్యపాత్ర పోషించిన ప్రమోద్ మహాజన్.. మహారాష్ట్రలో శివసేనతో పొత్తులు నిర్వహించడంలో కీలకంగా ఉన్నారు. తండ్రి వెంకటేశ్ దేవిదాస్ మహాజన్ మహబూబ్నగర్లో అధ్యాపకుడి పనిచేసిన సమయంలో ఆయన ద్వారా రాజకీయాలపై అభిరుచి పెంచుకున్నారు. పాఠశాల, కళాశాల విద్యాభ్యాసం చేసే రోజుల్లో రాజకీయాలకు సంబంధించి జరిగే చర్చల్లో పాల్గొనేవారు. మహారాష్ట్రకు కటుంబం వలస వెళ్లిన తర్వాత పుణెలోని రణాడే కళాశాలలో జర్నలిజం విద్యనభ్యసించారు. పొలిటికల్ సైన్స్ లో పీజీ చేశారు.
చిన్నానాటి నుంచే ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్న ప్రమోద్ మహాజన్..కొద్దికాలంపాటు తరుణ్ భారత్ పత్రికలో సబ్ ఎడిటర్గా పనిచేశారు. 1974 లో ఆర్ఎస్ఎస్ ఫుల్టైమర్గా చేరి దేశంలోని వివిధ ప్రాంతాల్లో సేవలందించారు. ఎమర్జెన్సీ సమయంలో అరెస్టై నాసిక్ జైల్లో ఉన్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజకీయాల్లో చేరారు. బీజేపీ స్థాపించగానే అందులో చేరిన మహాజన్.. అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర మంత్రి స్థాయికి చేరుకున్నారు.
నేడు ప్రపంచ పత్రికా స్వాతంత్ర్య దినోత్సవం
2019: ఒడిశాలో ‘ఫాని’ హరికేన్ సంభవించి 33 మంది మరణం
2008: పాకిస్తాన్ జైలులో భారత ఖైదీ సరబ్జిత్ సింగ్ ఉరితీత
2005 : పాకిస్తాన్లో పుట్టి అదే దేశానికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో భారత్ తరఫున పాల్గొన్న లెఫ్టినెంట్ జనరల్ జగ్జీత్సింగ్ అరోరా మరణం
1913: మొదటి భారతీయ చలన చిత్రం రాజా హరిశ్చంద్ర విడుదల
1845: చైనాలోని కాంటన్లో థియేటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 1600 మంది దుర్మరణం
లాక్డౌన్ తరహా ఆంక్షలు పొడగించిన పంజాబ్ ప్రభుత్వం
ప్రపంచంలోని పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జి ప్రారంభం
బంగ్లాదేశ్లో రెండు పడవల ఢీ.. 25 మంది మృతి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..