నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 25: నగరాలు, పట్టణాల్లో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధిని చూసి మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను ఆదరించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, మం త్రులు తన్నీరు హరీశ్రావు, పువ్వాడ అజయ్కుమార్, ఎర్రబెల్లి దయాకర్రావు, జగదీశ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్తోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పిలుపునిచ్చారు. ఆయా జిల్లాల్లో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో భాగం గా ఆదివారం విస్తృత ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ను గెలిపించి తమ నగరాలు, పట్టణాల ను మరింత అభివృద్ధి చేసుకోవాలని వారు కోరా రు. సిద్దిపేటలోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచా రం సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. సిద్దిపేట ఏ విధంగా అభివృద్ధి చెం దిందో అందరి కండ్లకు కన్పిస్తున్నదన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ను మరోసారి గెలిపించాలని హరీశ్రావు కోరారు.
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి మేయర్ పీఠాన్ని సీఎం కేసీఆర్కు కానుకగా ఇద్దామని రవాణా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఆదివారం ఆయన పలు డివిజన్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని డివిజన్లను గెలుస్తామ ని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ నామా నాగేశ్వరరావు తన ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. కాగా పలు డివిజన్లలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి, ఎమ్మెల్సీలు వాణీదేవి, బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, అరికెపుడి గాంధీ, సండ్ర వెంకటవీరయ్య, హరిప్రియా నాయక్, నల్లమోతు భాస్కర్రావు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు తదితరులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే పట్టణం సమగ్రాభివృద్ధి చెందుతుందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్లోని పలు వార్డుల్లో ప్రచారం చేశారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో కాంగ్రెస్, బీజేపీ పాలి త రాష్ర్టాలోఎక్కడా లేవన్నారు. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, గాదరి కిశోర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్రావు పాల్గొన్నారు.
టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట 8, 18వ వార్డుల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. అచ్చంపేటను సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. అచ్చంపేటలోని 20 వార్డు ల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అచ్చంపేట ప్రాంతంలోని మల్లెలతీర్థం, అక్కమహాదేవి గుహలు, ఉమామహేశ్వరం, ఇతర ప్రాం తాలను రూ.60 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. కాగా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే ఓరుగల్లు సమగ్రాభివృద్ధి సాధ్యమని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గ్రేటర్ వరంగల్లోని 1, 2వ డివిజన్లలో జరిగిన రోడ్డు షోలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి మంత్రి పాల్గొన్నారు. అనంతరం వరంగల్లో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని కోరారు.
గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో భాగంగా 60వ డివిజన్తోపాటు ఆర్యవైశ్యుల సమ్మేళనంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్బీహెచ్కాలనీలో టీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం అభినవ్ భాస్కర్ను గెలిపించాలని, ప్రభుత్వ ఛీప్ విప్ దాస్యం వినయభాస్కర్తో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వరంగల్ అభివృద్ధిని పట్టించుకోలేదని, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు కూడా ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాలేదని విమర్శించారు.
గ్రేటర్ వరంగల్లోని 32, 40వ డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ రోడ్షో నిర్వహించారు.