మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, షీ టీమ్స్కు వచ్చే ఫిర్యాదులపై మరింత వేగంగా స్పందించేందుకు సిబ్బందికి ద్విచక్రవాహనాలను పంపిణీ చేస్తున్నామని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. సేఫ్సిటీ ప్రాజెక్ట్లో భాగంగా ట్రై పోలీస్ కమిషనరేట్ల షీ టీమ్స్కు 60 బైక్లను అందజేశారు. అందులో భాగంగా సోమవారం గోషామహా ల్ స్టేడియంలో బైక్లను జెండా ఊపి హోంమంత్రి ప్రారంభించారు. సిటీకి 27, సైబరాబాద్-17, రాచకొండకు 16 బైక్లను షీ టీమ్స్కు అందజేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలను చక్కదిద్ది, తెలంగాణ పోలీసులు శాంతి భద్రతల పర్యవేక్షణలో దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా ముఖ్యమంత్రి చేశారని కొనియాడారు. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ షీ టీమ్స్ను ఏర్పాటు చేశారని, ఈవ్టీజింగ్లు లేకుండా చేయడంలో షీ టీమ్స్ విజయం సాధించి, ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. పోలీస్ శాఖలో మహిళలకు 33 శాతం రిజిర్వేషన్లు ఇస్తున్నామన్నారు. వ్యవస్తీకృత నేరాలను పూర్తిగా అణిచివేశామని, పీడీ యాక్టులతో నేరాలు పూర్తిగా తగ్గాయన్నారు. అయితే వ్యక్తిగతమైన నేరాలు జరుగుతున్నాయని, వాటిపై కూడా తగిన ప్రాణాళికతో వాటిని కట్టడి చేస్తామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్తో సామాన్యుడు ధైర్యంగా పోలీస్స్టేషన్కు వెళ్తున్నాడని, పైరవీకారులు, లీడర్లతో పనిలేకుం డా తమ పనులను స్వేచ్ఛగా చేసుకుంటున్నారని అన్నారు.