మనోహరాబాద్, ఏప్రిల్ 14: అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతిఒక్కరూ నడుచుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, మెదక్ జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్, ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. అంబేద్కర్ 130వ జయంతి వేడుకల్లో భాగంగా శివ్వంపేట మండలం గోమారం, మనోహరాబాద్ మండలం గౌతోజిగూడెంలో బుధవారం అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం చండిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. గౌతోజిగూడెంలో 13 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ సమాజాభివృద్ధి కోసం అంబేద్కర్ ఎంతగానో కృషి చేశారన్నారు. దేశానికే రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడని కొనియాడారు. యువత అంబేద్కర్ అడుగుజాడల్లో నడువాలని పిలుపునిచ్చారు. కల్యాణలక్ష్మి పథకంతో ఇంటి పెద్దకొడుకుగా సీఎం కేసీఆర్ నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, పీఏసీఎస్ చైర్మన్లు మెట్టు బాలకృష్ణారెడ్డి, వెంకట్రామ్రెడ్డి, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్రెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కో-ఆప్షన్ మన్సూర్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షురాలు లావణ్యమాదవరెడ్డి, రైతుబంధు మండల కో-ఆర్డినేటర్ సుధాకర్రెడ్డి, ఎంపీటీసీ నర్సింహారెడ్డి, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ అడుగు జాడల్లో నడవాలి
ప్రతిఒక్కరూ అంబేద్కర్ అడుగు జాడల్లో నడవాలని ఎమ్మెల్యే మదన్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు. బుధవారం నర్సాపూర్ చిల్డ్రన్స్ పార్కులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించిన గొప్ప మహనీయుడని కొనియాడారు. సుప్రీంకోర్డు జడ్జిమెంట్ ప్రకారం అంబేద్కర్ విగ్రహంతోపాటు పలువురి విగ్రహాలను చిల్డ్రన్స్ పార్కులో ఏర్పా టు చేశామన్నారు. త్వరలోనే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి అంబేద్కర్ విగ్రహంతో పాటు మిగతా విగ్రహాలను వేరే చోట ఏర్పాటుకు స్థలాన్ని గుర్తిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, ఆత్మకమిటీ చైర్మన్ శివకుమార్, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, ఏఎంసీ వైస్ చైర్మన్ హబీబ్ఖాన్, జడ్పీ కోఆప్షన్ సభ్యు డు మన్సూర్, డైరెక్టర్లు సూరారం నర్సింహులు, విద్యాసాగర్, టీఆర్ఎస్ నాయకులు, దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు.