ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ఆగిపోలేదట!
అల వైకుంఠపురంలో సినిమా హిట్తో మంచి ఫామ్ మీద ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఎన్టీఆర్ కోసం ఒక కథ సిద్ధం చేశాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు అయినను పోయిరావాలె హస్తినకు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ట్రిపుల్ ఆర్ షూటింగ్ అయిపోగానే జూనియర్ ఎన్టీఆర్తో ఈ సినిమా పట్టాలెక్కించబోతున్నారు. అరవింద సమేత తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా ఆగిపోయిందని కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ సినిమాను పక్కనపెట్టి ముందుగా మహేష్ బాబుతో త్రివిక్రమ్ ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చిత్రం నుంచి ఒక అప్డేట్ వచ్చింది.
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో 2018లో అరవింద సమేత సినిమా వచ్చింది. ఈ సినిమా వచ్చి రెండేళ్లు అవుతోంది కానీ ఇంతవరకు ఎన్టీఆర్ నుంచి మరో సినిమా రాలేదు. ఆయన కెరీర్లో తొలిసారి రెండేళ్లు ఖాళీగా వెళ్లిపోయాయి. 2019, 2020 అంతా ట్రిపుల్ ఆర్ కోసం రాజమౌళికే రాసిచ్చేశాడు తారక్. నిజానికి ఈ సినిమా 2020లోనే రావాల్సింది.. కానీ కరోనా కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యమైంది. ఈ సినిమా షూటింగ్ జూలైలోపు పూర్తి కానుంది. దసరా సందర్భంగా అక్టోబర్ 13న సినిమాను విడుదల చేసేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా వెంటనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఎన్టీఆర్ ఆలోచిస్తున్నాడు. ఇందుకోసమే ట్రిపుల్ ఆర్ అలా ఉండగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ను లైన్లో పెట్టేశాడు. ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి 2022 సమ్మర్లో విడుదల చేయాలని చూస్తున్నారు. పూర్తి పొలిటికల్ సెటైరికల్ సినిమాగా రూపొందబోయే ఈ చిత్రానికి అయిననూ పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తుంది. దాంతో పాటు చౌడప్ప నాయుడు అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత త్రివిక్రమ్ నుంచి రానున్న సినిమా కావడంతో అంచనాలు అలాగే ఉన్నాయి. పైగా ఎన్టీఆర్ కూడా ఇప్పుడు వరస విజయాలతో దూసుకుపోతున్నాడు. అందుకే ఈ చిత్రంపై ఆకాశమంత అంచనాలు ఉన్నాయి. అయితే ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా ఆగిపోయిందని కొద్ది రోజులుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఎన్టీఆర్ ను కాదని మహేష్ బాబుతో సినిమా చేయడానికి త్రివిక్రమ్ రెడీ అవుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ అవన్నీ పుకార్లేనని తెలుస్తోంది. ఈ సినిమా విషయంలో ఎలాంటి మార్పులు, వాయిదాలు ఉండబోవని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమా అయ్యాకే మిగిలిన సినిమాలపై త్రివిక్రమ్ దృష్టి పెట్టనున్నాడు. సోషల్ మీడియాలో వస్తున్నట్లు తారక్ సినిమా అయితే ఆగిపోలేదని.. మహేష్ బాబు సినిమాను 2022 తర్వాత త్రివిక్రమ్ పట్టాలెక్కించబోతున్నాడని తెలుస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి