కోల్కతా: పశ్చిమబెంగాల్లో మొదటి నాలుగు విడుతల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళిని చూసిన తర్వాత కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీకి ఓటమి ఖాయమనే విషయం అర్థమైందని, అందుకే వాళ్లు ఇప్పుడు తుపాకులను ఉపయోగిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జి విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జల్పాయ్గురిలో జరిగిన సభలో మాట్లాడిన ఆమె.. వాళ్లు (బీజేపీ) ఉపయోగించిన బుల్లెట్లపై మనం బ్యాలెట్లతో ప్రతీకారం తీర్చుకుందామని ఓటర్లకు పిలుపునిచ్చారు.
కాగా, శనివారం కూచ్బిహార్లో కేంద్ర బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందిన ఘటన నేపథ్యంలో ఎన్నికల సంఘం మూడు రోజులపాటు అక్కడికి రాజకీయ నాయకులు ఎవరూ వెళ్లకుండా నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో మమతాబెనర్జి తాను రాయల్ బెంగాల్ టైగర్నని, తనను ఎవరూ అడ్డుకోలేరని వ్యాఖ్యానించింది. వాళ్లు నన్ను కూచ్ బిహార్ వెళ్లకుండా అడ్డుకున్నా, తాను సిలిగురి నుంచి వారితో వీడియో కాల్స్ మాట్లాడానని పేర్కొన్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
టీకాలే లేకుండా టీకా ఉత్సవ్ ఎలా.. ప్రధానికి ముఖ్యమంత్రుల లేఖలు..!
దారితప్పి బావిలోపడ్డ ఏనుగుపిల్ల.. రక్షించిన అధికారులు.. వీడియో
అది ఒక హత్యాకాండ.. కూచ్బిహార్ కాల్పులపై మమతాబెనర్జి
72 గంటల్లో 12 మంది ఉగ్రవాదులు హతం..!
దేశంలో 10 కోట్ల మార్కు దాటిన కొవిడ్ వ్యాక్సినేషన్: కేంద్రం
వ్యాక్సినేషన్ రికార్డు.. 85 రోజుల్లోనే 10 కోట్ల మందికి టీకా
నాలుగు రోజుల టీకా ఉత్సవ్.. నాలుగు సూచనలు చేసిన మోదీ
తెలంగాణలో కొత్తగా 3,187 కరోనా కేసులు
దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. 24గంటల్లో 1.53లక్షల కేసులు