చేర్యాల/సిద్దిపేట : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది. డిసెంబర్ మాసంలో ప్రారంభమైన మల్లికార్జునుడి బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది 13వారాల పాటు కొనసాగాయి. చివరి ఆది వారం సందర్భంగా భక్తులు స్వామి వారిని దర్శించుకుని, అగ్నిగుండాలు కార్యక్రమంలో పాల్గొనేందుకు తరలివచ్చారు.
స్వామి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించే అగ్నిగుండాల కార్యక్రమాన్ని కనులార విక్షించేందుకు మల్లన్నక్షేత్రానికి తరలివచ్చిన భక్తులు క్షేత్రంలో వేచి ఉన్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అధికారులు, పోలీసులు ఆదేశాల మేరకు భక్తులు స్వామి వారి దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకుని వెళ్లిపోయారు.
కాగా ఆలయ రాజగోపురం ఎదురుగా శ్రీ మల్లికార్జున స్వామి వారి కల్యాణ వేదిక వద్ద అగ్నిగుండాల కార్యక్రమం వైభవంగా భక్తులుకు అనుమతి లేకుండా ఆలయ సంప్రదాయం మేరకు నిర్వహించేందుకు ఆలయవర్గాలు అన్ని ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి..
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే : మంత్రి ఐకే రెడ్డి
గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి రావు ఫూలే
అది దారుణ హత్యాకాండ.. కూచ్బిహార్ కాల్పులపై మమతాబెనర్జి