జగిత్యాల : సీఎంవో పేరు చెప్పి మోసాలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సీఎం పేషీ నుంచి మాట్లాడుతున్నానని చెప్పుకుంటూ సూర్యప్రకాశ్ అనే వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నాడు. పలువురిని బెదిరించి డబ్బు వసూలు చేశాడు. గడిచిన ఫిబ్రవరిలో జగిత్యాల టౌన్ప్లానింగ్ అధికారిణికి ఫోన్ చేసి డబ్బు ఇవ్వకపోతే పదోన్నతి దక్కదని బెదిరింపులకు పాల్పడ్డాడు.
టౌన్ప్లానింగ్ అధికారి తేజస్వినిని రూ.50 వేలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. హయత్నగర్కు చెందిన సూర్యప్రకాశ్పై గతంలోనే రైడీషీట్ నమోదైంది. హైదరాబాద్ సహా పలు చోట్ల ఇప్పటికే 16 కేసులు నమోదయ్యాయి. జగిత్యాల పోలీసులు సూర్యప్రకాశ్ను హైదరాబాద్లో అరెస్టు చేశారు.