నందికొండ, ఏప్రిల్ 8: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్ని వనరులను వినియోగిస్తూ మిగులు విద్యుత్తు ఉత్పత్తిని చేపడుతున్నామని, ఇతర రాష్ర్టాల నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని టీఎస్ జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ ప్రధాన జల విద్యుత్తు కేంద్రంలో గత ఏడాది ఫిబ్రవరిలో పాడైపోయిన 8వ టర్బయిన్ను పునరుద్ధరించారు. దీన్ని ఆయన గురువారం ప్రా రంభించారు.
అనంతరం పైలాన్ జెన్కో గెస్ట్హౌస్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం గా ప్రభాకర్రావు మాట్లాడుతూ.. సాగర్ జల విద్యుత్తు కేంద్రంలో అన్ని యూని ట్లు ఉత్పత్తికి, రివర్సబుల్ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయన్నారు. నాగార్జునసాగర్, శ్రీశైలం జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల ద్వారా రివర్సబుల్ విధానం ఉపయోగించి పీక్ సీజన్లోనూ ఉత్పత్తి చేయడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ సీజన్లో అత్యధికంగా డిమాండ్కు అనుగుణంగా 13,688 మిలియన్ యూనిట్ల అందించామని, అవసరమైతే 14 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్తు అందించడానికి కూడా సిద్ధమన్నారు.