కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ముందస్తు చర్యలు
ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సులు, బస్టాండ్లో శానిటైజేషన్
భౌతిక దూరం పాటించేలా చర్యలు
నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 7: కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆర్టీసీ అప్రమత్తమైంది. వివిధ జిల్లాలతో పాటు ఏపీకి సర్వీసులు నడుస్తున్న నేపథ్యంలో, ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు అధికారులు దృష్టి సారించారు. బస్సులను, బస్టాండ్ పరిసరాలను సోడియం హైపో క్లోరైట్ ద్రావణంతో శుభ్రం చేయిస్తున్నారు. నిత్యం శానిటైజ్ చేయించడంతో పాటు బస్టాండ్ పరిసరాల్లో భౌతిక దూరం పాటించి కూర్చుండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
బస్సుల్లో శానిటైజేషన్..
జిల్లాలో నిర్మల్, భైంసా డిపోల పరిధిలో నిత్యం ఉదయం బస్సులను సిబ్బంది శానిటైజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించేలా అవగాహన కల్పిస్తున్నారు. మాస్కులు ధరించని వారిని బస్సులోకి అనుమతించడం లేదు. నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ కరోనా వైరస్ దరిచేరకుండా చర్యలు తీసుకుంటున్నారు. మాస్కు ధరించకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి రూ.100 జరిమానా విధిస్తున్నారు.
బాసర ఆలయంలో కరోనా కలకలం
బాసర, ఏప్రిల్ 7: నిర్మల్ జిల్లా బాసర శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయంలో బుధవారం కరోనా కేసులు వెలుగు చూడడం కలకలం రేపింది. ఆలయంలో పూజారితో పాటు ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆలయాన్ని శానిటైజ్ చేయించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి..
ముంబైలో వ్యాక్సిన్ల కొరత.. 3 రోజుల వరకే నిల్వలు
పరిచయం అక్కర్లేని సితార్ ప్లేయర్.. పండిత్ రవిశంకర్.. చరిత్రలో ఈరోజు