పటాన్చెరు, ఏప్రిల్ 7 : కొవిడ్ నిబంధనలను అందరం పాటిద్దామని, రంజాన్ నెలలో ఇఫ్తార్ విందులకు దూరంగా ఉంటేనే రక్ష అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. పటాన్చెరు పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముస్లిం మత పెద్దలతో రంజాన్ పండుగ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రంజాన్ ఉపవాసాల క్యాలెండర్ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రంజాన్ పవిత్ర మాసంలో ముస్లింలు నిష్టగా ఉపవాసాలుంటారని కొనియాడారు. రంజాన్ నెలను ప్రశాంతంగా, భక్తిపూర్వకంగా నిర్వహించుకోవాలని కోరారు. ఇదే సమయంలో కరోనా రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితిని గుర్తించుకోవాలన్నారు. ప్రార్థనల సమయంలో భౌతిక దూరం పాటించాలని కోరారు. పరిమిత సంఖ్యలోనే ప్రార్థనలు చేయాలన్నారు. కొవిడ్ లక్షణాలున్న వ్యక్తులు ఉంటే వారిని దవాఖానకు తరలించాలన్నారు. మాస్కులు, శానిటైజర్లు అవసరం ఉంటే వాటిని అందజేస్తామని ఎమ్మెల్యే హామీనిచ్చారు. రంజాన్ పండుగను కొవిడ్ నిబంధనలతో జరుపుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ నాయకుడు ఎండీ షకీల్ ఆధ్వర్యంలో మసీదు పెద్దలకు శానిటైజర్ స్టాండ్లు, మాస్కులు, క్యాలెండర్లు అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎండీ అఫ్జల్, సీనియర్ నాయకులు విజయ్కుమార్, మత పెద్దలు లియాకత్ అలీ, ఇక్బాల్, మగ్దూం, వాజిద్, అజ్మత్, యాసిన్, మన్నాన్, ఖైసర్, మియా తదితరులు పాల్గొన్నారు.