పాపన్నపేట, ఏప్రిల్ 6 : మండలంలోని మిన్పూర్, కుర్తివాడ గ్రామాల్లో మంగళవారం వరి పొలాలను జోగిపేట ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త రాహుల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి పొలాల్లో మెడవిరుపు, మొగిపురుగు, సుడిదోమ, కంకినల్లి గుర్తించినట్లు తెలిపారు. పొలంలో సుడిదోమ కనిపిస్తే డైనోటేప్యూరన్ రసాయన మందు ఎకరానికి 100 గ్రాములు, లేదా పైమోట్రోజీన్ 120 గ్రాములు పిచికారీ చేయాలని సూచించారు. ఆయన వెంట పాపన్నపేట వ్యవసాయశాఖ అధికారి ప్రతాప్కుమార్, ఏఈవో రజిత, మిన్పూర్ సర్పంచ్ లింగారెడ్డి, నాయకుడు బార్పటేల్, రైతులు ఉన్నారు.
పంట పొలాలను పరిశీలించిన రెవెన్యూ అధికారులు
మండలంలోని శాలిపేట శివారులో మంగళవారం రెవెన్యూ అధికారులు పంట పొలాలను పరిశీలించారు. రెండు రోజుల కింద ఎవరి అనుమతి లేకుండా గ్రామానికి చెందిన కొంతమంది రైతులు తూమును ఇప్పడంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్ఐ శ్రీహరి, పోలీసులతో కలిసి పంట పొలాలను పరిశీలించారు. ఎవరి అనుమతులు లేకుండా తూమును ఇప్పడం సరి కాదని ఆర్ఐ శ్రీహరి తెలిపారు. ఆయన వెంట సర్పంచ్ పోచయ్య, గ్రామస్తులు ఉన్నారు.