నిడమనూరు, ఏప్రిల్ 1 : టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే నిడమనూరు పట్టణ అభివృద్ధి మొదలైందని ఉప ఎన్నికల మండల ఇన్చార్జీలు మిర్యాలగూడ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, ఆరూరి రమేశ్ అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కుమార్కు మద్దతుగా మండల కేంద్రంలో గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముప్పయ్యేండ్ల కాంగ్రెస్ పాలనలో నిడమనూరు అభివృద్ధిని విస్మరించారని అన్నారు. నిడమనూరు చెరువుకు గండి పడగా ఐదేండ్లు తాగు, సాగు నీటికోసం ప్రజలు, రైతుల ఆర్తనాదాలు కాంగ్రెస్కు పట్టలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన మిషన్ కాకతీయ పథకం ద్వారా గండి పూడ్చివేత, చెరువు మరమ్మతు చేపట్టి సమస్యను శాశ్వతంగా నివారించిందన్నారు. బస్టాండ్ పునః ప్రారంభానికి చర్యలు చేపట్టి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. అనాదిగా ప్రజల ఆకాంక్షగా ఉన్న నిడమనూరు-చింతగూడెం రోడ్డు ఏర్పాటును మూడు నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పాత తాలూకా నిడమనూరు అభివృద్ధికి టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక కార్యాచరణ ఉందని, భగత్కు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. నిడమనూరులో టీఆర్ఎస్ నాయకుడు దేశపాక ఉత్తరయ్య ఇటీవల మృతిచెందగా అతని కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ బొల్లం జయమ్మ, డీసీసీబీ డైరెక్టర్ విరిగినేని అంజయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటి సత్యపాల్, బొల్లం రవియాదవ్, నాయకులు ఉన్నం చిన్నవీరయ్య, మందలపు మురళి, వెంకటేశ్వర్లు, దాసు, శివ, వెంకన్న, కళావతి, శ్రీలత, కిషన్, భాస్కర్ పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండీ..
కరోనా ఎఫెక్ట్.. శానిటైజర్గా గంగాజలం
భర్త పుట్టింటికి తీసుకెళ్లలేదని పసిబిడ్డను పొడిచి చంపిన మహిళ..!