కొండగట్టులో నిర్విరామంగా చాలీసా పారాయణం
హాజరైన ఎమ్మెల్యే సంజయ్ దంపతులు, మంత్రి కొప్పుల సతీమణి
మల్యాల, మార్చి 30 : కొండగట్టు అంజన్న సన్నిధిలో హనుమాన్ చాలీసా పారాయణం కొనసాగుతున్నది. రెండు మండలాల కాలం పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పూడూరుకు చెందిన అంజన్న భక్తమండలి, మల్యాలకు చెందిన మఠాంజనేయస్వామి ఆలయ భజన బృందం, జగిత్యాలకు చెందిన వికాస తరంగిణి భజన మండలి సభ్యులతోపాటు కరీంనగర్కు చెందిన గాయకుడు శ్రీనివాస్ కలిసి 11 సార్లు పారాయణం చేశారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్-రాధిక దంపతులు, మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి స్నేహలత, చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ సతీమణి దీవెన ప్రత్యేకంగా హాజరై పారాయణం చేశారు.
ఆలయ స్థానాచార్యులు జితేంద్రప్రసాద్, ప్రధాన అర్చకులు రామకృష్ణ, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. ఇక్కడ ఆలయ ఈవో చంద్రశేఖర్, ఎంపీపీ మిట్టపల్లి విమల, జడ్పీటీసీలు కొండపలుకుల రాంమోహన్రావు, పునుగోటి ప్రశాంతి, సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మిట్టపల్లి సుదర్శన్, మల్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ జనగం శ్రీనివాస్, చొప్పదండి మున్సిపల్ చైర్మన్ గడ్డం నీరజ, ఆలయ ఏఈవో బుద్ది శ్రీనివాస్, ఆలయ ధర్మకర్తలు ప్రవీణ్, సురేందర్, శివకుమార్, నర్సయ్య, టీఆర్ఎస్ నాయకులు మే న్నేని రాజ నర్సింగరావు, అనుమండ్ల రఘు, జాగృతి నాయకు లు నీలగిరి రాజేందర్రావు, తాటిపాముల రాజేందర్, వొల్లాల శ్రీనివాస్గౌడ్, వొద్దినేని వెంకటేశ్వర్రావు, ఉజ్జగిరి జమున, నీలిమ, కల్పన, రమణ పాల్గొన్నారు.