అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా విమర్శలు చేశారు. టీడీపీని ఎన్టీఆర్ స్థాపిస్తే బాబు సమాధి చేశాడని ఆయన పేర్కొన్నారు.
‘తండ్రీకొడుకుల ధృతరాష్ట్ర కౌగిలి నుంచి బయట పడేదెప్పుడు? పచ్చ పార్టీకి కొత్త నాయకత్వం వచ్చేది ఎప్పుడు బుచ్చన్నా? త్వరలో చీలికలు, పీలికలు అయి ఎవరి ముక్క వాళ్లు లాక్కెళ్తారని సూటిగా చెప్పొచ్చుగా. నూతన నాయకులు రావడానికి ఏం మిగిలిందని? ఎన్టీఆర్ స్థాపిస్తే బాబు సమాధి చేశాడు పార్టీని’. అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
‘ముందు నిన్ను నువ్వు ప్రక్షాళన చేసుకో అచ్చన్నా. తర్వాత వాలంటీర్ల కథ చూద్దువు. వాలంటీర్లు అంటే స్వచ్చంద సేవకులని అర్థం. వారు చేస్తున్నది గొప్ప సేవ. వారేమైనా మీ జన్మభూమి కమిటీ సభ్యులనుకున్నావా? మండల ఆఫీసులో కూర్చొని మేసెయ్యడానికి! వాలంటీర్ వ్యవస్థ దండగో – పండగో జనం చెప్తారులే’. అని ఆయన విమర్శించారు.