దగ్గుబాటి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రానా అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారుజ. మొదట్లో రానా నటపై అనేక విమర్శలు రాగా, వాటన్నింటిని సరిదిద్దుకుంటూ ఇప్పుడు స్టార్ హీరో రేంజ్కు ఎదిగాడు. బాహుబలి సినిమాలో భళ్లాలదేవుడిగా రానా నటన అద్భతం. ఆయన పర్ఫార్మెన్స్కు విదేశీ అభిమానులు కూడా ఫిదా అయ్యారు. ప్రస్తుతం రానా అరణ్య అనే సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉండగా, ఈ సినిమా ప్రమోషన్లో పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు.
అరణ్య చిత్రం మార్చి 26న విడుదల కానుండగా, ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. బాహుబలి సినిమా సమయంలోనే దర్శకుడు ప్రభు సాల్మన్ ఈ కథను రానాకు వివరించాడట. ఈ సినిమా కోసం ఎలా మేకోవర్ ఉండాలో ముందే చెప్పారన్నారు. అదే సందర్భంలో తనని అనారోగ్య సమస్యలు వెంటాడాయని.. కిడ్నీ ఫెల్యూర్, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ వైద్యం కోసం విదేశాలకు వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు రానా. నేను అనారోగ్యం నుండి కోలుకునే వరకు దర్శకుడు ఆగడం గొప్ప విషయం. రియల్ లైఫ్లో జరిగే రియల్ ఇన్సిడెంట్స్.. రీల్ లైఫ్ని డిస్ట్రబ్ చేయకూడదనే ఉద్దేశంతో షూటింగ్లలో పాల్గొనేవాడినని. షూటింగ్స్లో పాల్గొనడం వలన అనారోగ్య సమస్యలను సింపుల్గా అధిగమించారని రానా పేర్కొన్నాడు.