మహబూబాబాద్ : జిల్లా పరిషత్కు బడ్జెట్లో రూ.500 కోట్లు నిధులు కేటాయించడం హర్షనీయమని జిల్లా జడ్పీ చైర్పర్సన్ బిందు అన్నారు. గురువారం అసెంబ్లీలో బడ్జెట్లో జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్ లకు రూ.500 కోట్లు నిధులు కేటాయించడం పట్ల జడ్పీ కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ బిందు మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన జెడ్పీలకు బడ్జెట్లో కోట్ల నిధులు కేటాయించడం సంతోషకరమన్నారు. వచ్చే ఆ నిధులతో జిల్లాను మరింత సమగ్రంగా అభివృద్ధి చేసుకోవచ్చు అని అభిప్రాయపడ్డారు. నిధులు కేటాయించినందుకు సీఎం కేసీఆర్తో పాటు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఇతర జెడ్పీటీసీలు తదితర నాయకులు పాల్గొన్నారు.