‘అభినయానికి ఆస్కారమున్న విలక్షణ పాత్రలతో నటిగా నా ప్రతిభను నిరూపించుకోవాలనుంది’ అని చెప్పింది రాశీసింగ్. ఆమె కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘శశి’. ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్నాయుడు దర్శకుడు. ఈ నెల 19న విడుదలకానుంది. రాశీసింగ్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘సునీత అనే గాయనిగా ఈ సినిమాలో కనిపిస్తా. నా నిజజీవితానికి పూర్తి భిన్నంగా ఎమోషనల్గా ఈ క్యారెక్టర్ సాగుతుంది. కథతో పాటు నా పాత్ర అందరికి కనెక్ట్ అవుతుంది. కొత్త తరహా పాత్రల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో దర్శకుడు శ్రీనివాస్ ఈ కథ వినిపించారు. చాలా నచ్చడంతో అంగీకరించా. నటనలో నేను ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. స్వతహాగా సినిమాలపై చిన్నతనం నుంచి ఉన్న ఇష్టమే పరిణతితో నటించేలా ఉపయోగపడుతోంది. ప్రియాంకచోప్రా నా అభిమాన నటి. ఆమెలా అన్ని జోనర్స్లో సినిమాలు చేయాలనుంది’ అని చెప్పింది.