చారిత్రక నగరానికి కొత్త రూపు తెచ్చాం
22 నెలల మేయర్ పదవి గొప్ప అనుభూతినిచ్చింది
నా హయాంలో రూ.1,255 కోట్లతో పనులు
సీఎం కేసీఆర్ నాకు ప్రత్యక్ష దైవం
పుట్టి పెరిగిన నగరంలో ప్రజలకు సేవచేసే భాగ్యం కల్పించారు
‘నమస్తే’ ఇంటర్వ్యూలో గ్రేటర్ వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్రావు
వరంగల్, మార్చి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చారిత్రక వరంగల్ నగరానికి తెలంగాణ రాష్ట్రంలో గొప్ప గుర్తింపు వచ్చిందని… ఐదేండ్లలో నగరం అద్భుతంగా అభివృద్ధి చెం దిందని గ్రేటర్ వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్రావు అన్నా రు. ఐదేండ్లలో ఏకంగా రూ.1416 కోట్లతో పనులు చేపట్టినట్లు తెలిపారు. తాను మేయర్గా ఉన్న 22 నెలల్లో ఏకంగా రూ.1255 కోట్ల పనులు చేశామన్నారు. గ్రేటర్ వరంగల్ మే యర్ పదవి చేపట్టడం తనకు గొప్ప అనుభూతి అని తెలిపా రు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ప్రత్యక్ష దైవమని, ఆయన ఇచ్చిన అవకాశంతో పుట్టి పెరిగిన వరంగల్ ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందని చెప్పారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్ మార్గదర్శనం, అండదండలతో వరంగల్ వేగంగా అభివృద్ధి చెందిందన్నారు. ఆదివారంతో పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో తన అనుభవాలను ‘నమస్తే’తో పంచుకున్నారు.
మేయర్ పదవి సంతృప్తి ఇచ్చింది..
నలభై ఏండ్ల రాజకీయ జీవితం నాది. 2001 నుంచి టీఆర్ఎస్లో ఉన్నా. మొదట్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించాను. గ్రేటర్ వరంగల్ పాలకవర్గం కొలువుదీరిన 2016 మా ర్చి 15 నుంచి ఇప్పటి వరకు రూ.1407 కోట్ల పనులు మం జూరయ్యాయి. మేయర్గా 22 నెలల పదవీ కాలంలో రూ. 1255 కోట్లు అభివృద్ధి పనులు మంజూరు చేశాను. సీఎం కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేశా. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, చీఫ్విప్ వినయభాస్కర్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల సహకారం గొప్పది.
ప్రజలకు అభివృద్ధి ఫలాలు..
నేను వరంగల్లోనే పుట్టాను, ఇక్కడే పెరిగాను. ఇక్కడి సమస్యలను ఏళ్ల తరబడి చూశాను. మేయర్గా పదవి చేపట్టి న మరుక్షణం నుంచి నగరాభివృద్ధి కోసం చర్యలు చేపట్టాను. 183 స్లమ్స్, 42 విలీన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. టీఆర్ఎస్ ప్రభు త్వం వచ్చిన తర్వాత వరంగల్ అభివృద్ధిపై కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. మంత్రి కేటీఆర్ పనులు వేగంగా జరిగేలా ఎప్పటికప్పుడు మమ్మల్ని ఆదేశించారు. రూ. 300 కోట్లతో విలీన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాం. స్లమ్స్ అభివృద్ధికి రూ.80 కోట్ల నిధులు కేటాయించాం.
ఎన్నో మార్పులు..
నగర విస్తీర్ణం 407.77 చదరపు కిలోమీటర్లు. నేను మేయర్గా బాధ్యతలు చేపట్టాకే అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులు మొదలయ్యాయి. ఎస్సీ సబ్ ప్లాన్ కింద గ్రేటర్ వరంగల్కు రూ.33 కోట్ల నిధులు వచ్చాయి. స్మార్ట్రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, జంక్షన్ల సుందరీకరణ, పార్కులను అభివృద్ధి చేశాం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మంకీ ఫుడ్ కోర్టు, పిల్లల కోసం ప్రత్యేకంగా సైకిల్ పార్కు ఏర్పాటు చే శాం. గతంలో గ్రేటర్లో ఒకే నర్సరీ ఉండేది. కొత్తగా 16 నర్సరీలను ఏర్పాటు చేశాం. కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో దశాబ్ద కాలంగా ఆగిపోయిన భవన నిర్మాణాన్ని పూర్తి చేశాం. అక్కడే మహాత్మాగాంధీ, బీఆర్ అంబేద్కర్ విగ్రహాలను… దీక్షా దివస్ పైలాన్ను నిర్మించాం. గ్రేటర్ వరంగల్ చరిత్రలో మొదటిసారిగా ఆలయాలకు నిధులు కేటాయించాం. రూ.4 కోట్లతో గోవిందరాజులగుట్టపైకి ఎక్కేందుకు, దిగేందుకు రెండువైపులా రోడ్డు మార్గం అభివృద్ధి చేస్తున్నాం. భద్రకాళి ఆలయంలో మాడవీధుల నిర్మాణం కోసం రూ.3 కోట్లు, డీపీఆర్ రూపకల్పన రూ.20 లక్షలు కేటాయించాం.
రూ.5.40 కోట్ల కరంటు ఆదా…
నగరంలో కొత్తగా 4300 పోల్స్, 69 వేల ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశాం. 12 ప్రధాన జంక్షన్లలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశాం. ఎనిమిది సెంటర్లలో పనులు పూర్తయ్యాయి. గతంలో గ్రేటర్ వరంగల్కు ప్రతి నెల రూ.87 లక్షల కరంటు బిల్లు వచ్చేది. నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత కరంటు వృథాను అరికట్టాం. ఇప్పుడు రూ.43 లక్షలకు తగ్గింది. ఏటా రూ.5.40 కోట్లు ఆదా అవుతోంది.
పుష్కలంగా మంచి నీళ్లు..
సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ భగీరథ ఫలాలు వరంగల్ నగర ప్రజలకు చేరాయి. గతంతో నగరంలో మంచినీళ్లకు తీవ్ర ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు శివారు ప్రాంతాల్లో సైతం పుష్కలంగా నీళ్లు వస్తున్నాయి. ఉగాది నుంచి ఇంటింటికి ప్రతి రోజూ సురక్షిత తాగునీటిని సరఫరా చేయబోతున్నాం. నగరంలో 2.55 లక్షల ఇండ్లకుగాను మరో 25 వేల ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది.
పారిశుధ్య నగరం..
పట్టణ ప్రగతి నిధులతో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. చెత్త సేకరణతోపాటు గల్లీలను శుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 12 స్వీపింగ్ మెషీన్లు కొనుగోలు చేశాం. చెత్త సేకరణను 312 స్వచ్ఛ ఆటోలు, 40 ట్రాక్టర్లను కొనుగోలు చేశాం. గతంలో గ్రేటర్లో 500 సీట్ల పబ్లిక్ టాయిలెట్లు ఉండేవి. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు పట్టణ ప్రగతి నిధులతో మరో 500 టాయిలెట్లను నిర్మించాం. మహిళల కోసం మొబైల్ టాయిలెట్లు, లూ కేఫ్లు నిర్మించాం.
కేసీఆర్ ప్రత్యక్ష దైవం..
నా దృష్టిలో కనిపించని దైవం కన్యకాపరమేశ్వరీ, ప్రత్యక్ష దైవం కేసీఆర్. మేయర్గా అవకాశం కల్పించారు. సీఎం కేసీఆర్ను ఎప్పుడు కలిసినా వరంగల్ గొప్పగా అభివృద్ధి చెందాలని చెబుతారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్కు వరంగల్పై సమగ్ర అవగాహన ఉంది. ఎప్పుడు కలిసినా ఫలనా పని ఎంత వరకు వచ్చిందని అడుగుతారు. కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాను. మేయర్గా అంకితభావంతో నగరాన్ని అభివృద్ది వైపు నడిపించాను. అనుకున్న పనులను వేగంగా పూర్తి చేసేలా పని చేశాను.
డాక్టర్ కావాలనుకున్నా
మా నాన్న వ్యాపా రం చేసేవారు. నాకు డాక్టర్ కావాలని కోరిక ఉండేది. మా నాన్న మాత్రం వ్యాపారంలోనే స్థిరపడాలని చెప్పేవారు. రాజకీయాలు వద్దనేవారు. వ్యాపారంలోకి వచ్చిన తర్వాత చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శిగా రెండుసార్లు ఎన్నికయ్యాను. హయగ్రీవాచారితో రాజకీయాల్లోకి ప్రవేశించాను. వరంగల్ మున్సిపాలిటీలో రెండుసార్లు కౌన్సెలర్గా, కార్పొరేషన్లో రెండుసార్లు కార్పొరేటర్గా ఎన్నికయ్యా.