అమరావతి : విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పరిరక్షణ కమిటీ చేస్తున్న ఉద్యమానికి సినీనటుడు చిరంజీవి తన మద్దతు ప్రకటించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ త్యాగాలకు గుర్తు అని ఆయన పేర్కొన్నారు. ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు ప్రాంతాలు, పార్టీలకతీతంగా పోరాడాలని ఆయన కోరారు. ఉద్యమానికి అంతా కలిసి రావాలని ట్విట్టర్ వేదికగా ఆయన పిలుపునిచ్చారు.