న్యూఢిల్లీ, మార్చి 9: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మరో మార్పు చేసింది. రూ.50 కోట్ల టర్నోవర్ దాటిన వ్యాపార సంస్థలు బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ) లావాదేవీలు నిర్వహించేందుకు ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్లను తప్పనిసరి చేసింది. ఈ నిబంధన ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ సుంకాల బోర్డు స్పష్టం చేసింది.